AP: ఏపీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీ

Update: 2025-09-16 02:00 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో పలు­వు­రు ఐఏ­ఎ­స్‌, ఐపీ­ఎ­స్‌ అధి­కా­రు­ల­ను బది­లీ చే­స్తూ ప్ర­భు­త్వం ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. రత­న్‌ టాటా ఇన్నో­వే­ష­న్‌ హబ్‌ సీ­ఈ­వో­గా ఏలూ­రు జేసీ ధా­త్రి రె­డ్డి­ని ని­య­మిం­చిం­ది. ఫై­బ­ర్‌­నె­ట్‌ ఎం­డీ­గా కృ­ష్ణా జి­ల్లా జేసీ గీ­తాం­జ­లి శర్మ, మౌ­లిక వస­తు­లు, పె­ట్టు­బ­డుల శాఖ ఎం­డీ­గా పా­డే­రు సబ్‌ కలె­క్ట­ర్‌ సౌ­ర్య మా­న్‌ పటే­ల్‌­ల­ను ని­య­మి­స్తూ ప్ర­భు­త్వ ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి వి­జ­యా­నం­ద్‌ ఉత్త­ర్వు­లు జారీ చే­శా­రు. అలా­గే, ఎన్‌­ఫో­ర్స్‌­మెం­ట్‌ డై­రె­క్ట­ర్‌ ఐపీ­ఎ­స్‌ రా­హు­ల్‌ దే­వ్‌ శర్మ­కు పూ­ర్తి అద­న­పు బా­ధ్య­త­ల­ను అప్ప­గిం­చా­రు. ఎక్సై­జ్‌ అం­డ్‌ ప్రొ­హి­బి­ష­న్‌ డై­రె­క్ట­ర్‌, ఏపీ­ఎ­స్‌­బీ­సీ­ఎ­ల్‌ ఎం­డీ­గా అద­న­పు బా­ధ్య­త­ల­తో పాటు డి­స్టి­ల­రీ­స్‌ అం­డ్‌ బ్రే­వ­రీ­స్‌ కమి­ష­న­ర్‌­గా పూ­ర్తి బా­ధ్య­త­ల­ను అప్ప­గి­స్తూ ఎక్సై­జ్‌ శాఖ ప్రి­న్సి­ప­ల్‌ సె­క్ర­ట­రీ ము­ఖే­ష్‌ కు­మా­ర్‌ మీనా జీవో జారీ చే­శా­రు.

14 జిల్లాలకు కొత్త ఎస్పీలు

రా­ష్ట్రం­లో­ని 14 జి­ల్లా­ల­కు ప్ర­భు­త్వం కొ­త్త ఎస్పీ­ల­ను ని­య­మిం­చిం­ది. వీ­రి­లో ఏడు­గు­రు ప్ర­స్తు­తం వి­విధ జి­ల్లా­ల్లో ఎస్పీ­లు­గా కొ­న­సా­గు­తు­న్నా­రు. వా­రి­ని అక్క­డి నుం­చి వేరే జి­ల్లా­ల­కు బది­లీ చే­సిం­ది. ఇతర వి­భా­గాల బా­ధ్య­త­ల్లో ఉన్న మరో ఏడు­గు­రు అధి­కా­రు­ల­కు వి­విధ జి­ల్లా­ల్లో ఎస్పీ­లు­గా అవ­కా­శం కల్పిం­చిం­ది.

Tags:    

Similar News