AP: ఏపీ తలరాతను మార్చే విశాఖ సమ్మిట్
సదస్సుకు వేగంగా జరుగుతున్న ఏర్పాట్లు.. సర్వాంగ సుందరంగా విశాఖ ముస్తాబు... రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
విశాఖ సహజసిద్ధంగానే అందమైన నగరం. ఇపుడు ఈ మెగా సిటీ సరికొత్త సొగసులు అద్దుకుంటోంది. సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది ఇదంతా దేనికి అంటే విశాఖకు వస్తున్న దేశ విదేశీ అతిధుల కోసం. విశాఖలో ఈ నెల 14, 15 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టనర్ షిప్ సమ్మిట్-2025 ని నిర్వహిస్తున్నారు. ఇది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయి సదస్సు. దాంతో దానికి అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో జరిగే సమ్మిట్ కోసం గత రెండు నెలల నుంచి విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రహదారుల సుందరీకరణ నుంచి పార్కులు బీచ్ పరిసరాలు విహార స్థలాల అలంకరణ వరకూ అన్నీ సిద్ధం చేస్తున్నారు. విశాఖలో ఉన్న స్టార్ హొటళ్ళతో పాటు ప్రముఖ హొటళ్ళు అన్నీ ఈ అతి పెద్ద ఈవెంట్ కోసం రెడీ చేసి పెట్టారు. దేశ విదేశీ ప్రముఖులు బస చేసేందుకు అలాగే సాయంత్రం వేళలలో వారు విహరించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే సదస్సు ఉండడతో కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ద్వారా ఏకంగా 410 దాకా ఒప్పందలౌ వివిధ రంగాలలో పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుందని చెబుతున్నారు. అంతే కాదు లక్షలలో పెట్టుబడులు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఏకంగా మూడు వేల మంది అతిథులు హాజరవుతారని అంటున్నారు. దాంతో ఈ భారీ సమ్మిట్ ని సక్సెస్ ఫుల్ గా చేయడానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రమిస్తోంది.
ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనేలా సదస్సు
ఆంధ్రా ఈజ్ బ్యాక్ అనే రీతిలో ఈ ఏడాది నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సీఐఐ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025ను సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో ఉండవల్లి నివాసంలో తొలి సమీక్ష సమావేశం నిర్వహించింది. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. . ఇప్పటివరకు 45దేశాల నుంచి 300మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నట్లు మాకు సమాచారం ఉంది.