Arrangements for the Meeting of two CM's : బాబు, రేవంత్ ఇద్దరు సీఎంల మీటింగ్‌కు ఏర్పాట్లు

Update: 2024-07-03 06:26 GMT

విభజన సమస్యల పరిష్కారానికి సమావేశమవుదామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( N. Chandrababu Naidu ) రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6 తేదీ శనివారం జ్యోతి రావుపూలే ప్రజాభవన్ వేదికగా ఇరువురం కలిసి చర్చిద్దామని రేవంత్ రెడ్డి మంగళవారం చంద్రబాబుకు రాసిన లేఖలో తెలిపారు.

ఏపీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, విభజన చట్టం పెండింగ్ సమస్యలకు పరిష్కారం అవసరమని అన్నారు. వాటిని కలిసి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖి చర్చలు ఎంతో అవసరమని లేఖలో ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీ తెలంగాణ రాష్ట్రా ల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు రేవంత్. ఈ చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయన్న నమ్మకం ఉందని రేవంత్ చెప్పారు. ఇరు రాష్ట్రాలు సుస్థిర ప్రగతి సాధించేందుక రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అతికొద్ది మంది రాజకీయనేతల్లో ఒకరిగా చంద్రబాబు నిలిచారని రేవంత్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News