ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు అన్వేష్పై సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్రాజులపై హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైబర్క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ‘ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.