CBN: సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం

నేటి నుంచి చంద్రబాబు కీలక చర్చలు... నేడు ప్రవాసాంధ్రులతో భేటీ;

Update: 2025-07-27 03:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­ట­మే లక్ష్యం­గా ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు సిం­గ­పూ­ర్‌­లో కా­లు­మో­పా­రు. విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు తన మంత్రులతో కలసి సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం సింగపూర్‌ చేరుకున్న సీఎం బృందానికి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో చంద్రబాబుకు ఆహ్వానం పలికేందుకు అక్కడి తెలుగు కుటుంబాలు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. చిన్నారులు కూచిపూడి నాట్యంతో ఘన స్వాగతం పలికారు. ఐదు రోజుల పర్యటనలో 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం, మంత్రులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేశ్‌, నారాయణ, టీజీ భరత్‌, ఉన్నతాధికారులు పర్యటనలో పాల్గొన్నారు.

ఆరు రోజుల టూర్

నేటి నుం­చి 31 తేదీ వరకు 6 రో­జు­ల­పా­టు ఆయన ఆ దే­శం­లో పర్య­టి­స్తా­రు. అక్క­డి ది­గ్గజ బి­జి­నె­స్‌ సం­స్థల ప్ర­తి­ని­ధు­లు, యా­జ­మా­న్యా­లు, ప్ర­ము­ఖు­లు, పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­తో భే­టీ­అ­వు­తా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం ఏర్ప­డిన తరు­వాత దా­వో­స్ పర్య­ట­న­కు వె­ళ్లిన సిఎం... రెం­డో వి­దే­శీ పర్య­ట­న­గా సిం­గ­పూ­ర్‌­కు వె­ళ్లా­రు. బ్రాం­డ్ ఏపీ ప్ర­మో­ష­న్‌­తో రా­ష్ట్రా­ని­కి పె­ట్టు­బ­డు­ల­ను సా­ధిం­చేం­దు­కు చం­ద్ర­బా­బు టీం ఈ పర్య­ట­న­ను వే­దిక చే­సు­కో­నుం­ది. ప్ర­భు­త్వం తీ­సు­కొ­చ్చిన నూతన పా­రి­శ్రా­మిక పా­ల­సీ­లు, స్పీ­డ్ ఆఫ్ డూ­యిం­గ్ బి­జె­నె­స్ వి­ధా­నా­ల­ను వి­వ­రిం­చ­బో­తు­న్నా­రు. వీ­లై­నంత ఎక్కువ పె­ట్టు­బ­డు­దా­రు­ల­ను ఆహ్వా­నిం­చ­ను­న్నా­రు. పో­ర్టు­లు, ఎయి­ర్ పో­ర్టు­లు, హై­వే­లు, హా­ర్బ­ర్లు, భూ­ముల లభ్యత, కనె­క్టి­వి­టీ, 1053 కి­లో­మీ­ట­ర్ల తీర ప్రాం­తం, ని­పు­ణు­లైన మానవ వన­రు­లు గు­రిం­చి వి­వ­రిం­చ­ను­న్నా­రు. పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు చంద్రబాబు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఏపీలో పెట్టబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సిఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.  

పెట్టుబడుల సదస్సు లక్ష్యంగా టూర్

ఏపీ­లో పో­ర్టు ఆధా­రిత ప్రా­జె­క్టు­లు, సెమి కం­డ­క్ట­ర్లు, ఏఐ, డేటా సెం­ట­ర్ల ఏర్పా­టు­కు సం­బం­ధిం­చిన పె­ట్టు­బ­డు­ల­పై ము­ఖ్య­మం­త్రి చర్చిం­చ­ను­న్నా­రు. ఈ ఏడా­ది నవం­బ­రు­లో వి­శా­ఖ­లో ని­ర్వ­హిం­చే పె­ట్టు­బ­డుల సద­స్సు­కు సిం­గ­పూ­ర్ పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల­ను ఆహ్వా­నిం­చేం­దు­కు ఆ దే­శా­ని­కి చెం­దిన ప్ర­ము­ఖు­ల­తో­నూ ము­ఖ్య­మం­త్రి భేటీ కా­ను­న్నా­రు. డి­జి­ట­ల్ ఎకా­న­మీ, ఫి­న్‌­టె­క్‌­పై ని­ర్వ­హిం­చే బి­జి­నె­స్ రౌం­డ్ టే­బు­ల్ సమా­వే­శా­ల్లో కూడా ము­ఖ్య­మం­త్రి పా­ల్గొం­టా­రు. అలా­గే సిం­గ­పూ­ర్‌­లో ని­ర్వ­హిం­చే బి­జి­నె­స్ రోడ్ షోకు హా­జ­ర­వు­తా­రు. ఆ దే­శం­లో­ని వి­విధ మౌ­లిక సదు­పా­యా­లు, లా­జి­స్టి­క్ కేం­ద్రా­ల­ను కూడా సీఎం సం­ద­ర్శిం­చ­ను­న్న­ట్టు ము­ఖ్య­మం­త్రి కా­ర్యా­ల­యం తె­లి­పిం­ది.

Tags:    

Similar News