టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మృతిపట్ల చంద్రబాబు, లోకేష్‌ సంతాపం

Update: 2020-11-20 07:29 GMT

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ మృతి పట్ల.. చంద్రబాబు, లోకేష్‌లు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని.. తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారని లోకేష్‌ అన్నారు. శ్రీనివాస ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు.



Tags:    

Similar News