Bhadradri Kothagudem: పాల్వంచలో విషాదం.. కుటుంబం సజీవ దహనం.. అగ్ని ప్రమాదామా? ఆత్యహత్యా?

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.

Update: 2022-01-03 02:57 GMT

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచలో చోటుచేసుకుంది. మృతుల్లో మండిగ నాగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య ఉన్నారు. మరో కూతురు సాహితి పరిస్థితి విషమంగా ఉంది. అయితే.. గ్యాస్‌ లీకైందా..? ఆత్మహత్య చేసుకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేట్టారు.

Tags:    

Similar News