MUSEUM: అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియం

టీడీపీకి-నేతన్నలకు అవినాభావ సంబంధం.. నేతన్నలకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా;

Update: 2025-08-08 02:30 GMT

భా­ర­తీయ శక్తి­కి, సం­స్కృ­తి­కి, సాం­ప్ర­దా­యా­ల­కు దశా­బ్దాల క్రి­త­మే ఖ్యా­తి­ని తీ­సు­కు­వ­చ్చిం­ది మన చే­నేత పరి­శ్రమ అని ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు­నా­యు­డు అభి­వ­ర్ణిం­చా­రు. పొం­దూ­రు ఖద్ద­ర్ వస్త్రా­ల­ను గాం­ధీ­జీ సైతం మె­చ్చు­కు­న్నా­ర­ని కొ­ని­యా­డా­రు. తె­లు­గు­దే­శం పా­ర్టీ­కి, చే­నేత వర్గా­ని­కి అవి­నా­భావ సం­బం­ధం ఉం­ద­ని ఉద్ఘా­టిం­చా­రు. వ్య­వ­సా­యం తర్వాత ఎక్కువ మంది ఆధా­ర­ప­డి జీ­విం­చే సం­స్థ చే­నేత అని వ్యా­ఖ్యా­నిం­చా­రు. తాము అధి­కా­రం­లో ఉన్నా, లే­క­పో­యి­నా చే­నేత కా­ర్మి­కుల కోసం ఎన్నో పో­రా­టా­లు చే­శా­మ­ని నొ­క్కి­చె­ప్పా­రు. రూ.110 కో­ట్ల చే­నేత రు­ణా­లు మాఫీ చే­శా­న­ని ప్ర­క­టిం­చా­రు. గుం­టూ­రు జి­ల్లా మం­గ­ళ­గి­రి­లో ఏర్పా­టు చే­సిన 11వ జా­తీయ చే­నేత ది­నో­త్స­వం­లో సీఎం పా­ల్గొ­న్నా­రు. అమ­రా­వ­తి­లో హ్యాం­డ్లూ­మ్‌ మ్యూ­జి­యం ఏర్పా­టు చే­స్తా­మ­ని తె­లి­పా­రు. ‘‘నై­పు­ణ్యం, సృ­జ­నా­త్మ­కత కల­యిక చే­నే­త­లు. తె­లు­గు­దే­శం పా­ర్టీ­కి నే­త­న్న­ల­కు అవి­నా­భావ సం­బం­ధం ఉంది. నే­త­న్న­ల­కు ఉపా­ధి కల్పిం­చిన నేత ఎన్టీ­ఆ­ర్‌. వ్య­వ­సా­యం తర్వాత అధి­కం­గా ఉపా­ధి కల్పిం­చే­ది వస్త్ర పరి­శ్రమ. 55,500 మంది చే­నేత కా­ర్మి­కు­ల­కు రూ.2లక్ష­లు చొ­ప్పున రూ.27కో­ట్లు రు­ణా­లు ఇచ్చాం. 90,765 కు­టుం­బా­ల­కు 100 యూ­ని­ట్లు కరెం­టు ఉచి­తం­గా ఇచ్చాం." అని గు­ర్తు చే­శా­రు.

చేనేత కార్మికులపై వరాల జల్లు

చే­నేత కా­ర్మి­కు­ల­పై వరాల జల్లు కు­రి­పిం­చా­రు. చే­నేత కా­ర్మి­కుల ఆదా­యం రె­ట్టిం­పు అయ్యే­లా చూసే బా­ధ్యత తన­దే­న­ని వె­ల్ల­డిం­చా­రు. చే­నేత మగ్గా­లు ఉన్న­వా­రి­కి, పవర్ లూ­మ్‌­ల­కు ఉచి­తం­గా వి­ద్యు­త్ అం­దిం­స్తా­మ­ని తే­ల్చి చె­ప్పా­రు. కొ­త్త డి­జై­న్ల­పై చే­నేత కా­ర్మి­కు­ల­కు ట్రై­నిం­గ్ ఇచ్చి.. వారి ఆదా­యా­న్ని మరింత పెం­చే­లా చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని ము­ఖ్య­మం­త్రి తె­లి­పా­రు. చే­నే­త­పై జీ­ఎ­స్టీ­ని కూడా రీ­యం­బ­ర్స్ చే­స్తా­మ­ని.. చే­నేత కా­ర్మి­కు­ల­కు పె­న్ష­న్లు ఇస్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. జా­తీయ చే­నేత ది­నో­త్స­వం నే­ప­థ్యం­లో అక్క­డి­కి వచ్చిన చే­నేత కా­ర్మి­కు­ల­తో సీఎం చం­ద్ర­బా­బు.. నే­రు­గా మా­ట్లా­డి వారి సమ­స్య­లు, వాటి పరి­ష్కా­రా­ని­కి అను­స­రిం­చా­ల్సిన మా­ర్గా­ల­పై చర్చిం­చా­రు. ఈ నెల నుం­చే చే­నేత మగ్గా­లు ఉన్న­వా­రి­కి నె­ల­కు 200 యూ­ని­ట్ల ఉచిత కరెం­టు­ను సర­ఫ­రా చే­స్తా­మ­ని సీఎం చం­ద్ర­బా­బు హామీ ఇచ్చా­రు. ఒక­వేళ పవర్ లూమ్ ఉన్న­వా­రి­కి నె­ల­కు 500 యూ­ని­ట్ల ఉచిత వి­ద్యు­త్ ఇస్తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. అం­తే­కా­కుం­డా చే­నేత కా­ర్మి­కు­ల­కు జీ­ఎ­స్టీ­లో 5 శా­తా­న్ని తి­రి­గి వె­న­క్కి ఇచ్చే­లా చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని స్ప­ష్టం చే­శా­రు.

చేనేత పుట్టిన నేల

ఈ సం­ద­ర్భం­గా చే­నేత వై­భ­వా­ని­కి పు­ట్టి­ని­ల్లు తె­లు­గు నేల అని.. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రా­ని­కి చే­నేత ఒక సంపద అని చం­ద్ర­బా­బు కొ­ని­యా­డా­రు. శ్రీ­కా­కు­ళం జి­ల్లా­లో­ని పొం­దూ­రు ఖద్ద­రు­ను మహా­త్మా­గాం­ధీ మె­చ్చు­కు­న్నా­ర­ని గు­ర్తు చే­శా­రు. హర­ప్పా కాలం నుం­చి చే­నేత అభి­వృ­ద్ధి చెం­దు­తూ వస్తోం­ద­ని.. నా­గ­రి­క­త­కు మూలం నే­త­న్న­నే అంటూ ప్ర­శం­స­లు కు­రి­పిం­చా­రు. కా­క­తీ­యు­లు పా­లిం­చిన కా­లం­లో.. నా­ణే­ల­పైన చే­నే­తల ము­ద్ర­లు కని­పి­స్తా­య­ని పే­ర్కొ­న్నా­రు. చే­నేత కా­ర్మి­కు­ల­కు తొ­లి­సా­రి­గా 50ఏళ్ల­కే పిం­ఛ­న్‌ ఇవ్వా­ల­ని ని­ర్ణ­యిం­చాం. చి­న్న వయ­సు­లో­నే అనా­రో­గ్యం పా­ల­వు­తు­న్న పరి­స్థి­తి.. అం­దు­కే 50 ఏళ్ల­కే పిం­ఛ­న్‌ తీ­సు­కొ­చ్చాం. 50శాతం సబ్సి­డీ­తో మర మగ్గా­ల­కు రూ.80కో­ట్లు ఖర్చు పె­ట్టాం. ఈ నెల నుం­చే 200యూ­ని­ట్ల వి­ద్యు­త్‌ ఉచి­తం­గా ఇస్తా­మ­ని హామీ ఇస్తు­న్నాం. ఉచిత వి­ద్యు­త్‌ వల్ల 93 వేల కు­టుం­బా­ల­కు లబ్ధి కలు­గు­తుం­ది. చే­నే­త­­కు ఎంత ఇచ్చి­నా తక్కు­వే అవు­తుం­ది’’అని చం­ద్ర­బా­బు అన్నా­రు.

Tags:    

Similar News