పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంది ప్రవహిస్తున్నాయి. పీలేరు వాగుకు వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని నాగులేరు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.