JAGAN: జగన్ గారూ..అసెంబ్లీ మీద అలిగితే ఎవరికి నష్టం.?

జగన్‌ తీరుపై సర్వత్రా విమర్శలు

Update: 2025-09-19 04:30 GMT

వై­సీ­పీ అధి­నేత, మాజీ ము­ఖ్య­మం­త్రి, పు­లి­వెం­దుల ఎమ్మె­ల్యే వై­ఎ­స్ జగ­న్మో­హ­న్ రె­డ్డి... మరో­సా­రి శా­స­న­సభ సమా­వే­శా­ల­కు డు­మ్మా కొ­ట్టా­రు. తొలి రోజు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ శా­స­న­స­భ­కు జగన్ సహా వై­సీ­పీ ఎమ్మె­ల్యే­లు ఎవ్వ­రూ రా­లే­దు. శా­స­న­మం­డ­లి­కి మా­త్రం వై­సీ­పీ ఎమ్మె­ల్సీ­లు హా­జ­ర­య్యా­రు. అయి­తే జగన్ ఈ సమా­వే­శా­ల­కు హా­జ­రు­కా­క­పో­వ­డం­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు వస్తు­న్నా­యి. తనకు ప్ర­తి­ప­క్ష నేత హోదా ఇస్తే తప్ప.. అసెం­బ్లీ­కి రా­నం­టూ వై­సీ­పీ అధ్య­క్షు­డు వై­ఎ­స్‌ జగ­న్‌ భీ­ష్మిం­చ­డం అనేక ప్ర­శ్న­ల­ను లే­వ­నె­త్తు­తోం­ది. పా­ర్టీ­కి సభలో ఎంత మంది సభ్యు­లు ఉన్నా.. ప్ర­జా­స­మ­స్య­ల­పై ప్ర­భు­త్వా­న్ని ఇరు­కున పె­ట్టా­మా లేదా అన్న­దా­ని­కే రా­జ­కీయ పా­ర్టీ­లు ప్రా­ధా­న్య­మి­స్తా­యి. జగ­న్‌ దా­ని­ని పక్క­న­పె­ట్టి.. ప్ర­తి­ప­క్ష నేత హోదా ఇవ్వా­ల్సిం­దే­న­ని.. సీఎం ఎం­త­సే­పు మా­ట్లా­డి­తే తనకూ అంతే సమయం ఇవ్వా­ల­ని షర­తు­లు పె­ట్ట­డం­పై రా­జ­కీయ ని­పు­ణు­లు సహా ఆ పా­ర్టీ వారే వి­స్మ­యం వ్య­క్తం చే­స్తు­న్నా­రు.

జగన్‌ శాసనసభ్యుడు మాత్రమే..

58 మంది సభ్యుల ఏపీ శాసన మం­డ­లి­లో వై­సీ­పీ ఎమ్మె­ల్సీల సం­ఖ్యా­బ­లం 34. అధి­కార కూ­ట­మి (13) కంటే ఎక్కు­వ­గా ఉం­డ­డం­తో వై­సీ­పీ పక్ష నే­త­గా బొ­త్స­కు ప్ర­తి­ప­క్ష నా­య­కు­డి హోదా లభిం­చిం­ది. అధి­కా­రి­కం­గా క్యా­బి­నె­ట్‌ ర్యాం­కు కూడా దక్కిం­ది. అవ­స­ర­మై­న­ప్పు­డు సభలో కా­స్త ఎక్కువ సమ­య­మే మా­ట్లా­డే అవ­కా­శం కూడా బొ­త్స­కు లభి­స్తోం­ది. జగ­న్‌ శా­స­న­స­భ్యు­డు మా­త్ర­మే. పొ­రు­గు సభలో బొ­త్స సత్య­నా­రా­యణ ప్ర­తి­ప­క్ష నేత హో­దా­లో ఉంటే.. తాను కే­వ­లం ఎమ్మె­ల్యే­గా ఉం­డ­డం­తో అహం అడ్డొ­చ్చి జగ­న్‌ అసెం­బ్లీ­కి రా­నం­టు­న్నా­ర­ని వై­సీ­పీ నే­త­లు బా­హా­టం­గా­నే గు­స­గు­స­లా­డు­తు­న్నా­రు. వా­స్త­వా­ని­కి మం­డ­లి­లో ప్ర­తి­ప­క్ష నే­త­గా బొ­త్స ఉన్న­ప్ప­టి­కీ.. మి­గ­తా వై­సీ­సీ ఎమ్మె­ల్సీ­లు కూడా ప్ర­జా సమ­స్య­ల­పై చర్చ­ల్లో పా­ల్గొం­టు­న్నా­రు. ప్ర­శ్నో­త్త­రాల సమ­యం­లో అధి­కార, వి­ప­క్ష సభ్యుల మధ్య వా­ద­న­లు గట్టి­గా­నే జరు­గు­తు­న్నా­యి. వి­ప­క్షా­ని­కి ఎక్కువ సమయం దొ­రు­కు­తు­న్నా.. ప్ర­భు­త్వం కూడా అభ్యం­త­ర­పె­ట్ట­కుం­డా చర్చ­లు సా­గి­స్తోం­ది.

జగన్ బలాన్ని మర్చిపోతే ఎలా..?

2024 అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో జగన్ పా­ర్టీ­కి దా­దా­పు 40 శాతం ఓట్లు వచ్చా­యి. అంటే కోటి, ము­ప్ప­య్ రెం­డు లక్షల, ఎనభై నా­లు­గు వేల, నూట ము­ప్ప­య్ నా­లు­గు (1,32,841,34) ఓట్లు లభిం­చా­యి. 2019–2024 మధ్య­కా­లం­లో పా­ల­న­కు లభిం­చిన అవ­కా­శా­న్ని వి­ని­యో­గిం­చు­కు­ని జగన్ భారీ వి­ధ్వం­సా­న్ని చే­శా­ర­న్న ఆరో­ప­ణ­లు ఉన్నా­యి. అయి­నా నలభై శాతం మంది ప్ర­జ­లు జగన్ వెంట నడి­చా­రు. ఇది చి­న్న వి­ష­యం కాదు. జన­సేన పే­రు­తో ప్ర­జా జీ­వి­తం­లో­కి 2014లో మహా దూ­కు­డు­గా అడు­గు­పె­ట్టిన పవన్ కల్యా­ణ్ వెంట దశా­బ్దం తరు­వాత కూడా ఆరే­డు శా­తా­ని­కి మిం­చి ఓట­ర్లు నడ­వ­లే­దు. అం­దు­కే, జగన్ వెంట నడి­చిన 40 శాతం ప్ర­జల సమ­స్య­ల­ను ప్ర­భు­త్వం దృ­ష్టి­కి తీ­సు­కు వె­ళ్ళా­ల్సిన నై­తిక బా­ధ్యత జగన్ పా­ర్టీ­కి ఉన్న­ది. వారి పొ­లా­ల­కు నీరు సక్ర­మం­గా అం­దు­తు­న్న­దా, వారి వ్య­వ­సాయ ఉత్ప­త్తు­ల­కు గి­ట్టు­బా­టు ధరలు లభి­స్తు­న్నా­యా, వా­ళ్ళ పి­ల్ల­ల­కు ‘తల్లి­కి వం­ద­నం’ ని­ధు­లు లభిం­చా­యా, వా­రి­కి ఆరో­గ్య­శ్రీ సహా­యం లభి­స్తు­న్న­దా, వారి మహి­ళ­ల­కు బస్సు­ల్లో ఉచిత ప్ర­యా­ణం­లో ఇబ్బం­దు­లు ఉన్నా­యా, పో­లీ­స్ స్టే­ష­న్ల­లో వా­రి­కి ఏమై­నా అన్యా­యా­లు జరు­గు­తు­న్నా­యా... వంటి సవా­ల­క్ష అం­శా­ల­పై ప్ర­భు­త్వం సరి­గా వ్య­వ­హ­రిం­చ­క­పో­తే ని­ల­దీ­యా­ల్సిన అవ­స­రా­న్ని వైసీపీ గు­ర్తిం­చ­లే­క­పో­తోం­ది.

Tags:    

Similar News