వైసీపీ ప్రభుత్వ వైఖరిపై జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్‌ ఆగ్రహం

Update: 2020-09-10 07:35 GMT

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి హిందూ ధార్మిక సంస్థలపై దాడులు పెరిగిపోతున్నాయని.. జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది దివ్యరథం ప్రమాదంపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ తన నివాసం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం పారదర్శక విచారణ చేపట్టకపోతే.. కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఐ ఎంక్వైరీ కోరుతామని కందుల దుర్గేష్‌ అన్నారు.

Tags:    

Similar News