ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఫైర్...!

ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫ్యాక్షన్ మైండ్ ఉన్న జగన్ అక్రమ కేసులతో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Update: 2021-05-04 12:30 GMT

ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫ్యాక్షన్ మైండ్ ఉన్న జగన్ అక్రమ కేసులతో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, దూళిపాళ్ల నరేంద్రను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో ఎవరు ఉంటారని జగన్ అనలేదా అని గుర్తుచేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఎలా గెలిచిందో అందరికీ తెలుసన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని సీఎం జగన్‌ను కొల్లు రవీంద్ర సూటిగా ప్రశ్నించారు.

Tags:    

Similar News