lokesh: "ఏపీని కాపాడేందుకు ముందుకొచ్చారు"

సింగపూర్‌లో లోకేశ్ కీలక చర్చలు;

Update: 2025-07-29 04:30 GMT

సిం­గ­పూ­ర్‌ అభి­వృ­ద్ధి చెం­దిన తీ­రు­ను స్ఫూ­ర్తి­గా తీ­సు­కో­వా­ల­ని ఏపీ మం­త్రి నారా లో­కే­శ్‌ అన్నా­రు. సిం­గ­పూ­ర్‌­లో తె­లు­గు డయా­స్పో­రా వా­లం­టీ­ర్ల­తో ని­ర్వ­హిం­చిన సమా­వే­శం­లో ఆయన మా­ట్లా­డా­రు. ‘‘గత ఐదే­ళ్ల వి­ధ్వంస పాలన చూసి తె­లు­గు­వా­రం­తా ముం­దు­కొ­చ్చా­రు. రా­ష్ట్రా­న్ని కా­పా­డు­కు­నేం­దు­కు వి­దే­శా­ల్లో­ని తె­లు­గు­వా­రం­తా ముం­దు­కొ­చ్చా­రు. ఏదే­శం వె­ళ్లి­నా సీఎం చం­ద్ర­బా­బు, నేను తొ­లుత తె­లు­గు­వా­ళ్ల­ను కల­వా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నాం. డబు­ల్‌ ఇం­జి­న్‌ సర్కా­ర్‌ ఏర్పా­టు వల్ల రా­ష్ట్రం అభి­వృ­ద్ధి చెం­దు­తోం­ది. ప్ర­ధా­ని మోదీ త్వ­ర­లో­నే సిం­గ­పూ­ర్‌­లో పర్య­టి­స్తా­రు. మోదీ పర్య­ట­న­లో­నూ తె­లు­గు­వా­రం­తా పా­ల్గొ­ని వి­జ­య­వం­తం చే­యా­లి’’ అని లో­కే­శ్‌ చె­ప్పా­రు. జగన్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు.

సైమన్ టాన్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ

సింగపూర్‌ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఎవర్‌వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్‌‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సోలార్ సెల్, మాడ్యూల్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని కోసం గ్రీన్ ఎనర్జీ పాలసీ–2024ను ప్రకటించామని వివరించారు. దీనికి సైమన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఐదేళ్లు విధ్వంస పాలన

సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి లోకేశ్ అన్నారు. సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్ల విధ్వంస పాలన చూసి తెలుగువారంతా ముందుకొచ్చారు. ఏ దేశం వెళ్లినా సీఎం చంద్రబాబు, నేను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పాటు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. PM మోదీ త్వరలోనే సింగపూర్‌లో పర్యటిస్తారు’ అని చెప్పారు

Tags:    

Similar News