రెడ్బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు వస్తోందని ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన నారా లోకేశ్కు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వర్ల కుమార్రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. తెలుగు మహిళలు హారతి ఇచ్చారు. తల్లికి వందనం అమలు చేసినందుకు సంతోషంగా ఉందని మహిళలు ధన్యవాదాలు తెలిపారు. పిల్లలను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం అమలు చేశామని లోకేశ్ తెలిపారు. వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా ఎలా మాట్లాడారో చూశామన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవించే పరిస్థితి ఉంటుందన్నారు. త్వరలో పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పెడతామన్నారు. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో మాట్లాడే విధానం మారాలన్నారు. చట్టాలు, డబ్బులతో ఆ మార్పు రాదన్నారు. బ్రాహ్మణి సహకారం లేకపోతే తాను ఏం చేయలేనని అన్నారు. సమాజంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మహిళలతో మాట్లాడే తీరులో మార్పు రావాలని మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. సమాజంలో మార్పులు, చట్టాలతోనే.. డబ్బులు పంచడంతోనే రాదన్నారు. ప్రతి ఒక్కరిలో మంచి నడవడిక అలవాటు కావాలన్నారు.