MINISTER: "జగన్‌కు మిగిలింది పార్టీ విలీనమే"

జగన్ గన్‌మెన్ల వీరంగం;

Update: 2025-08-14 13:30 GMT

పు­లి­వెం­దుల జడ్పీ­టీ­సీ ఉప ఎన్ని­క­ల్లో తె­లు­గు­దే­శం పా­ర్టీ వి­జ­యం­పై మం­త్రి రాం­ప్ర­సా­ద్‌­రె­డ్డి సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు.. వై­ఎ­స్‌­ఆ­ర్‌ కాం­గ్రె­స్‌ పా­ర్టీ­కి, వై­ఎ­స్‌ జగ­న్మో­హ­న్‌­రె­డ్డి­కి మి­గి­లిం­ది పా­ర్టీ వి­లీ­న­మే అని కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు పో­వ­డ­మే కా­కుం­డా ఇప్పు­డు సొంత మం­డ­లం కూడా పో­యిం­ద­న్న ఆయన.. భా­ర­తీయ జనతా పా­ర్టీ దగ్గ­ర­కు వె­ళ్ళ­లే­డు కా­బ­ట్టి.. ఆయన మాతృ పా­ర్టీ కాం­గ్రె­స్ పా­ర్టీ­లో­నే వై­ఎ­స్‌­ఆ­ర్ కాం­గ్రె­స్‌ పా­ర్టీ­ని వి­లీ­నం చే­స్తా­డే­మో…? ఆయ­న­కు మి­గి­లిం­ది అదొ­క్క­టే అని పే­ర్కొ­న్నా­రు. చం­ద్ర­బా­బు సీఎం అయిన తర్వాత కూ­ట­మి ప్ర­భు­త్వం అం­ది­స్తో­న్న సం­క్షేమ పథ­కా­లు, అభి­వృ­ద్ధి­ని చూసే ప్ర­జ­లు పు­లి­వెం­దు­ల­లో టీ­డీ­పీ­కి వి­జ­యం అం­ధిం­చా­ర­ని రాం­ప్ర­సా­ద్‌ రె­డ్డి పే­ర్కొ­న్నా­రు. ఒక్క మె­తు­కు పట్టు­కొ­ని చూ­స్తే.. అన్నం ఒడి­కిం­దో లేదో.. ఎలా తె­లు­స్తుం­ది.. ఇప్పు­డు ప్ర­జల మనో­గ­తం ఈ ఎన్ని­క­ల­తో తె­లు­స్తుం­ద­న్నా­రు.. అయి­తే, వై­ఎ­స్‌ జగ­న్‌­కు ప్ర­జా­స్వా­మ్య­వ్య­వ­స్థ­పై, ఎన్ని­కల కమి­ష­న్‌­పై నమ్మ­కం లే­క­పో­వ­డం­తో­నే ఇష్టం­వ­చ్చి­న­ట్టు­గా మా­ట్లా­డు­తు­న్నా­ర­ని ఫై­ర్‌ అయ్యా­రు.

వైసీపీ కార్యకర్తను చితకబాదిన జగన్ గన్‌మెన్లు

అనం­త­పు­రం­లో మాజీ సీఎం జగ­న్‌­మో­హ­న్‌­రె­డ్డి గన్‌­మె­న్లు వై­సీ­పీ కా­ర్య­క­ర్త­ను చి­త­బా­దిన వీ­డి­యో సా­మా­జిక మా­ధ్య­మా­ల్లో వై­ర­ల్‌­గా మా­రిం­ది. అనం­త­పు­రం­లో జరి­గిన ఓ వి­వాహ వే­డు­క­కు హా­జ­రైన జగ­న్‌.. తి­రు­గు పయ­నం­లో వా­హ­నం­పై­కి ఎక్కి కా­ర్య­క­ర్త­ల­కు అభి­వా­దం చే­శా­రు. ఆ సమ­యం­లో భా­రీ­గా చే­రు­కు­న్న వై­సీ­పీ కా­ర్య­క­ర్తల మధ్య తో­పు­లాట జరి­గిం­ది. ఈ తో­పు­లా­ట­లో జగ­న్‌ గన్‌­మె­న్లు ఓ వై­సీ­పీ కా­ర్య­క­ర్త­పై దా­డి­కి పా­ల్ప­డ్డా­రు. ఈ ఘట­న­లో ఓ మహిళ కూడా స్ప­ల్ప అస్వ­స్థ­త­కు గు­ర­య్యా­రు.

Tags:    

Similar News