MODI: "ఏపీ పర్యటన సంతోషాన్ని ఇచ్చింది"

దేశాభివృద్ధికి ఏపీ కీలకమన్న మోదీ

Update: 2025-10-17 03:30 GMT

ఏపీ పర్య­టన చాలా ఆనం­దా­న్ని­చ్చిం­ద­ని ఎక్స్‌­లో ప్ర­ధా­ని మోడీ ట్వీ­ట్ చే­శా­రు. రా­ష్ట్ర పర్య­టన ము­గిం­చు­కు­ని తి­రి­గి ఢి­ల్లీ వె­ళ్లా­రు. ఈ సం­ద­ర్భం­గా ఆయన ఎక్స్ వే­ది­క­గా స్పం­దిం­చా­రు. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా కనె­క్టి­వి­టీ­ని పెం­చే కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న­డం గర్వ­కా­ర­ణం­మ­న్నా­రు. పరి­శ్ర­మ­ల­ను అభి­వృ­ద్ధి చేసి ప్ర­జ­ల­ను శక్తి­మం­తు­లు చే­సే­లా చాలా ప్రా­జె­క్టు­లు మం­జూ­రు చే­శా­మ­ని తె­లి­పా­రు. ‘‘శ్రీ­శై­లం క్షే­త్రం­లో ఉం­డ­టం అపా­ర­మైన ఆనం­దా­న్ని ఇస్తుం­ది. ఈ పవి­త్ర స్థ­లం­లో అడు­గ­డు­గున దై­వ­త్వం నిం­డి ఉంది. ఇక్క­డి ప్ర­జల సాదర స్వా­గ­తా­ని­కి నేను కృ­త­జ్ఞు­డి­ని. శ్రీ భ్ర­మ­రాం­బి­కా దేవి, మల్లి­కా­ర్జున స్వా­మి వా­ర్లు ఎల్ల­ప్పు­డూ దే­శా­న్ని ఆశీ­ర్వ­దిం­చా­ల­ని కో­రు­కుం­టు­న్నా­ను.’ అని పే­ర్కొ­న్నా­రు.

ప్ర­ధా­ని మోడీ ఈ రోజు కర్నూ­లు జి­ల్లా­లో పర్య­టిం­చా­రు. పలు ప్రా­జె­క్టు­ల­కు వర్చు­వ­ల్ గా శం­కు­స్థా­ప­న­లు, ప్రా­రం­భో­త్స­వా­లు చే­శా­రు. రెం­డు ప్రా­జె­క్టు­ల­ను జా­తి­కి అం­కి­తం చే­శా­రు. నన్నూ­రు­లో ఏర్పా­టు చే­సిన బహి­రంగ సభలో పా­ల్గొ­న్నా­రు. రా­ష్ట్ర అభి­వృ­ద్ధి­పై ప్ర­సం­గిం­చా­రు. అనం­త­రం తి­రి­గి ఢి­ల్లి­కి బయ­ల్దే­రి వె­ళ్లా­రు. ఈ సం­ద­ర్భం­గా ఎక్స్ వే­ది­క­గా ప్ర­ధా­ని మోడీ స్పం­దిం­చా­రు. భా­ర­త్‌­ను 21వ శతా­బ్ద­పు తయా­రీ కేం­ద్రం­గా ప్ర­పం­చం చూ­స్తోం­ది. ఆత్మ­ని­ర్భ­ర్‌ భా­ర­త్‌ సా­ధ­న­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ కీ­ల­కం­గా మా­ర­నుం­ద­ని ప్ర­ధా­ని అన్నా­రు.

ప్రధాని కర్మయోగి: పవన్

ఎలాం­టి ఫలి­తా­లు ఆశిం­చ­కుం­డా కే­వ­లం దేశ సేవే పర­మా­వ­ధి­గా పని చే­స్తు­న్న ప్ర­ధాన నరేం­ద్ర మో­డీ­ని మనం కర్మ­యో­గి­గా చూ­స్తు­న్నా­మ­ని డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌ అన్నా­రు. ‘సూ­ప­ర్‌ జీ­ఎ­స్టీ.. సూ­ప­ర్ సే­విం­గ్స్‌’ బహి­రంగ ఆయన పా­ల్గొ­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా పవన్ మా­ట్లా­డు­తూ.. మోదీ దే­శా­న్ని మా­త్ర­మే కా­ద­ని, రెం­డు తరా­ల­ను నడు­పు­తు­న్నా­ర­ని తె­లి­పా­రు. ప్ర­పం­చ­మం­తా దేశం వైపు తలె­త్తి చూసే వి­ధం­గా ఆత్మ­ని­ర్భ­ర్‌ భా­ర­త్‌ తీ­సు­కొ­చ్చా­ర­ని కొ­ని­యా­డా­రు. ఒక తరం కోసం ఆలో­చిం­చే నా­య­కు­డు చం­ద్ర­బా­బు అంటూ ప్ర­శం­సిం­చా­రు. కూ­ట­మి 15 ఏళ్ల­కు తక్కువ కా­కుం­డా బలం­గా ఉం­డా­ల­ని ఆయన ఆకాం­క్షిం­చా­రు. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి ప్ర­ధా­ని మో­దీ­తో పాటు సీఎం చం­ద్ర­బా­బు, మం­త్రి నారా లో­కే­శ్‌ సహా పలు­వు­రు మం­త్రు­లు, ప్ర­ము­ఖు­లు హా­జ­ర­య్యా­రు. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా పలు­చో­ట్ల ని­ర్మిం­చిన, ని­ర్మిం­చ­బో­తు­న్న రూ.13,429 కో­ట్ల వి­లు­వైన ప్రా­జె­క్టు­ల­కు ప్ర­ధా­ని వర్చు­వ­ల్‌­గా ప్రా­రం­భో­త్స­వా­లు, శం­కు­స్థా­ప­న­లు చే­శా­రు.

Tags:    

Similar News