ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ఎంపి రఘురామ కృష్ణరాజు అన్నారు. అమరావతిలో ఒక కులంవారు ఉన్నారని అనడం శోచనీయమన్నారు. రాజధాని ప్రాంతంలో సీఎంను ప్రేమించే కులం, మతం వారే అధికంగా ఉన్నారని రఘురామ వెల్లడించారు. కుల,మతాలకు అతీతంగా సామరస్యంగా ఉన్న చక్కని వాతావరణాన్ని సీఎం చెడగొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.