బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం : చంద్రబాబు
ఏపీ బీసీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమన్నారు చంద్రబాబు.;
ఏపీ బీసీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమన్నారు చంద్రబాబు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వైసీపీ అణిచివేస్తోందని మండిపడ్డారు. టీడీపీ అమలు చేసిన 35 కు పైగా పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు . చేనేత దినోత్సవం రోజు మదనపల్లి చేనేత ఆత్మహత్య.. వైసీపీ పాలనకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.బీసీలకు కార్పొరేషన్, ఫెడరేషన్ ద్వారా ఆర్ధిక స్వాతంత్రం కల్పించామన్నారు చంద్రబాబు. రెండేళ్లుగా కార్పొరేషన్ వ్యవస్థ అనేదే లేకుండా జగన్ రెడ్డి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి సొంత సామాజకివర్గంతో పదవుల్ని నింపుకున్నారని అన్నారు. త్వరలోనే వెనుకబడిన వర్గాల సమాఖ్య ఏర్పాటు చేసి అండంగా నిలుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.