ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ షోకాజ్ నోటీసులు
నంద్యాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.;
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయ పడింది. పోలీసుల దాష్టీకం వల్లే ఈ ఘటన జరిగిందని... దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఈ కేసులో వాస్తవాలు కలవరపరిచేలా ఉన్నాయన్న ఎన్హెచ్ఆర్సీ.... ప్రజా సేవకుల ద్వారా తీవ్రమైన మావన హక్కుల ఉల్లంఘన జరిగిందని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది.
ఇక 6 వారాల్లోగా పరిహారాన్ని పిటిషనర్కు చెల్లించాలని ఎందుకు ఆదేశించకూడదో తెలియజేయాలని సీఎస్ను ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో ప్రమేయమున్న పోలీసులపై శాఖాపరంగా తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో నివేదికను... నిర్దిష్ట వ్యవధిలో సమర్పించాలని సీఎస్ను, డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. కేసుకు సంబంధించి కర్నూలు ఎస్పీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. ఇక ఈ కేసుపై అక్టోబరు 4న విచారించనుంది ఎన్హెచ్ఆర్సీ.