PEDDIREDDY: కలకలం రేపుతోన్న "పెద్దిరెడ్డి" అటవీ ఆక్రమణ

ఆక్రమణలు నిజమేనన్న అటవీశాఖ అధికారులు

Update: 2025-11-14 05:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్  ఉప ము­ఖ్య­మం­త్రి, జన­సేన పా­ర్టీ అధి­నేత పవన్ కల్యా­ణ్ చి­త్తూ­రు జి­ల్లా­లో­ని మం­గ­ళం­పేట అటవీ ప్రాం­తం­లో వై­ఎ­స్ఆ­ర్ కాం­గ్రె­స్ పా­ర్టీ   సీ­ని­య­ర్ నేత, మాజీ మం­త్రి పె­ద్ది­రె­డ్డి రా­మ­చం­ద్రా­రె­డ్డి ,  కు­టుంబ సభ్యుల అక్రమ భూమి ఆక్ర­మ­ణ­ల­ను బహి­ర్గ­తం చేసే సం­చ­ల­నా­త్మక వీ­డి­యో­ను వి­డు­దల చే­శా­రు. రక్షిత అటవీ భూ­ము­ల్లో 76.74 ఎక­రా­లు ఆక్ర­మిం­చు­కు­ని, వా­టి­పై అక్రమ కట్ట­డా­లు ని­ర్మిం­చా­ర­ని, రె­వె­న్యూ రి­కా­ర్డు­ల­ను తా­రు­మా­రు చే­శా­ర­ని పవన్ కల్యా­ణ్ ఆరో­పిం­చా­రు. ఇటీ­వల ఏరి­య­ల్ సర్వే­లో  స్వ­యం­గా ఈ ప్రాం­తా­న్ని పరి­శీ­లిం­చి వీ­డి­యో­లు తీ­శా­రు. వి­జి­లె­న్స్ వి­భా­గం ని­వే­దిక ఆధా­రం­గా కఠిన చర్య­లు తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­ల­కు ఆదే­శా­లు జారీ చే­శా­రు.

ఆక్రమణలు వెలుగులోకి

చి­త్తూ­రు జి­ల్లా తూ­ర్పు కను­మ­ల­లో­ని మం­గ­ళం­పేట  రక్షిత అటవీ ప్రాం­తం­లో జరి­గిన ప్ర­త్యేక ఏరి­య­ల్ సర్వే­లో ఈ ఆక్ర­మ­ణ­లు వె­లు­గు­లో­కి వచ్చా­యి. పవన్ కల్యా­ణ్ తన తాజా తి­రు­ప­తి పర్య­టన సం­ద­ర్భం­గా హె­లి­కా­ప్ట­ర్‌­లో ఈ ప్రాం­తా­న్ని సం­ద­ర్శిం­చి, భూమి ఆక్ర­మ­ణ­ల­ను డా­క్యు­మెం­ట్ చే­శా­రు. వీ­డి­యో­ల్లో కని­పిం­చే దృ­శ్యాల ప్ర­కా­రం, అటవీ మధ్య­లో గె­స్ట్ హౌ­స్‌­లు, ఇతర అక్రమ ని­ర్మా­ణా­లు  ఉన్నా­యి.  ఈ భూ­ము­లు పె­ద్ది­రె­డ్డి కు­టుం­బా­ని­కి చెం­దిన వా­ర­స­త్వ ఆస్తు­లు­గా  అధి­కార దు­ర్వి­ని­యో­గం­తో రి­కా­ర్డు మా­ర్చా­ర­ని ఆయన ఆరో­పిం­చా­రు. అటవీ భూ­ము­లు మన పర్యా­వ­ర­ణా­ని­కి, భవి­ష్య­త్తు­కు అమూ­ల్య­మై­న­వి. వీ­టి­ని రా­జ­కీయ నే­త­లు ఆక్ర­మిం­చు­కో­వ­డం అనే­ది తీ­వ్ర­మైన నేరం అని పవన్ స్ప­ష్టం చే­శా­రు.  ఈ ఆక్ర­మ­ణ­లు వై­సీ­పీ పా­లిత దశలో జరి­గా­య­ని, తమ ప్ర­భు­త్వం ఇటు­వం­టి అక్ర­మా­ల­ను సహిం­చ­ద­ని స్ప­ష్టం చే­శా­రు.

ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమే

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూములలో ఆక్రమణలు చోటు చేసుకున్న మాట వాస్తవం. ఇందుకు సంబంధించి భారత న్యాయసంహితను అనుసరించి ఏపీ అటవీ చట్టంలోని 61 (2),20 (1)(డి)(2), 52(డి) ప్రకారం కేసులు నమోదు చేశాము. ఈ కేసులో ఏ1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. ఏ2గా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఏ3గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేర్లు నమోదు చేశాము. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్‌ రిపోర్ట్‌ (పీవోఆర్‌) ప్రకారం చార్జిషీటు దాఖలు చేశాం. ఆక్రమణకు గురైన 32.63 ఎకరాల భూమిని స్వాధీనం చేస్తుకున్నాం. కోర్టులో కేసుల వివరాలు దాఖలు చేశామని పీసీసీఎఫ్ (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.) కార్యాలయం ప్రకటన చేసింది.



Tags:    

Similar News