POLITICS: రేపు ప్రతీకార దినోత్సవం: రఘురామ కృష్ణం రాజు

ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం;

Update: 2025-05-13 05:30 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, టీడీపీ నేత రఘురామ కృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఉండి నియోజకవర్గంలో ప్రతీకార దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. 2021లో తనపై రాజద్రోహం కేసు పెట్టారని రఘురామ కృష్ణం రాజు ఆరోపించారు. తనను ఏం చేశారో ప్రజలందరికి తెలుసన్నారు. ఇది ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు అన్నారు.

Tags:    

Similar News