ఏపీలో దుర్వినియోగం అవుతున్న రేషన్‌ పంపిణీ వాహనాలు..!

రేషన్‌ పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు దుర్వినియోగమవుతున్నాయి. ఓ వైపు ఇంటింటికీ వచ్చి రేషన్‌ ఇవ్వడం లేదన్న ఆరోపణలూ వస్తున్నాయి.

Update: 2021-04-01 03:55 GMT

రేషన్‌ పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు దుర్వినియోగమవుతున్నాయి. ఓ వైపు ఇంటింటికీ వచ్చి రేషన్‌ ఇవ్వడం లేదన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఏకంగా ఓ వాహనం టైర్లను ఎత్తుకెళ్లారు దొంగలు. విశాఖ జిల్లా పెదగంట్యాడ తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటింటికీ రేషన్‌ తమ వల్ల కాదంటూ ఓ వాహనాన్ని నిర్వాహకుడు ప్రభుత్వానికి తిరిగి అప్పగించాడు. దీంతో ఆ వాహనం తహసీల్దార్‌ కార్యాలయంలో ఉంచారు అధికారులు. అయితే.. ఆ వాహనం నాలుగు చక్రాలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News