SANKRANTHI: పండుగ ప్రయాణానికి ప్రత్యేక ఏర్పాట్లు

ఏపీలో రికార్డు స్థాయిలో 8,432 బస్సులు... అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక బస్సులు...ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ

Update: 2026-01-08 03:30 GMT

తె­లు­గు వారి పె­ద్ద పం­డుగ సం­క్రాం­తి వచ్చే­సిం­ది. ఊళ్ల­కు వె­ళ్లే ప్ర­యా­ణి­కు­ల­తో బస్టాం­డ్లు, రై­ల్వే స్టే­ష­న్లు కి­ట­కి­ట­లా­డు­తు­న్నా­యి.ప్రై­వే­ట్ ట్రా­వె­ల్స్ దో­పి­డీ నుం­చి సా­మా­న్యు­డి­ని కా­పా­డేం­దు­కు ప్ర­భు­త్వం చర్య­లు తీ­సు­కుం­టోం­ది. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ వి­ష­యా­ని­కి వస్తే.. ఏపీ­ఎ­స్‌­ఆ­ర్టీ­సీ ఈ ఏడా­ది రి­కా­ర్డు స్థా­యి­లో 8,432 ప్ర­త్యేక బస్సు­ల­ను పం­డుగ కోసం రం­గం­లో­కి దిం­చిం­ది. గతం­లో స్పె­ష­ల్ బస్సుల పే­రు­తో 50% అద­న­పు ఛా­ర్జీ­లు వసూ­లు చే­సే­వా­రు. కానీ ఈ 2026 సం­క్రాం­తి­కి కే­వ­లం సా­ధా­రణ ఛా­ర్జీ­ల­తో­నే స్పె­ష­ల్ బస్సు­లు నడు­పు­తు­న్న­ట్లు ప్ర­భు­త్వం ప్ర­క­టిం­చిం­ది. హై­ద­రా­బా­ద్, బెం­గ­ళూ­రు, చె­న్నై వంటి నగ­రాల నుం­చి పల్లె­ల­కు వె­ళ్లే వా­రి­కి ఇది ఒక పె­ద్ద ఊరట.ఇక తె­లం­గాణ ఆర్టీ­సీ వి­ష­యా­ని­కి వస్తే.. ప్ర­యా­ణి­కుల కోసం ఒక అద్భు­త­మైన ఆఫర్ తె­చ్చిం­ది. హై­ద­రా­బా­ద్ నుం­చి మీ ఊరి­కి వె­ళ్ల­డా­ని­కి తి­రి­గి రా­వ­డా­ని­కి అంటే రౌం­డ్ ట్రి­ప్ ఒకే­సా­రి టి­కె­ట్ బుక్ చే­సు­కుం­టే, తి­రు­గు ప్ర­యా­ణం టి­కె­ట్ ధరపై 10% రా­యి­తీ ఇస్తు­న్నా­రు. సు­మా­రు 6,431 పైగా బస్సు­లు అం­దు­బా­టు­లో ఉన్నా­యి. పం­డు­గల వేళ ప్రై­వే­ట్ ట్రా­వె­ల్స్ ఆగ­డా­లు ఇంకా తగ్గ­లే­దు. హై­ద­రా­బా­ద్ నుం­చి వి­శా­ఖ­కు బస్సు టి­కె­ట్ ధర ఏకం­గా 5 వేల నుం­చి 7 వేల వరకు పలు­కు­తోం­ది. ఇది వి­మాన ప్ర­యా­ణం కంటే ఎక్కువ. ప్ర­భు­త్వా­లు ఎన్ని బస్సు­లు వే­సి­నా, ప్రై­వే­ట్ ఆప­రే­ట­ర్ల­పై నిఘా పె­ట్ట­డం­లో వి­ఫ­ల­మ­వు­తు­న్నా­య­నే వి­మ­ర్శ­లు వి­ని­పి­స్తు­న్నా­యి.

దాం­తో­పా­టు రద్దీ వల్ల టోల్ ప్లా­జాల వద్ద గంటల తర­బ­డి ట్రా­ఫి­క్ జామ్ అయ్యే అవ­కా­శం ఉంది. సం­క్రాం­తి 2026 కోసం రై­ల్వే శాఖ కూడా ము­ను­పె­న్న­డూ లేని వి­ధం­గా భారీ ఏర్పా­ట్లు చే­స్తోం­ది. సం­క్రాం­తి ప్ర­యా­ణీ­కు­ల­కు రై­ల్వే శాఖ నుం­డి అది­రి­పో­యే గుడ్ న్యూ­స్ చె­ప్పిం­ది. బస్సుల రద్దీ­ని దృ­ష్టి­లో ఉం­చు­కు­ని, సా­మా­న్యు­డి ప్ర­యా­ణా­న్ని సు­ఖ­మ­యం చే­య­డా­ని­కి దక్షిణ మధ్య రై­ల్వే భారీ ప్లా­న్‌­తో ముం­దు­కొ­చ్చిం­ది. సం­క్రాం­తి రద్దీ­ని తగ్గిం­చ­డా­ని­కి దక్షిణ మధ్య రై­ల్వే ఈ ఏడా­ది ఏకం­గా సు­మా­రు 600 వరకు ప్ర­త్యేక రై­ళ్ల­ను వి­విధ వి­డ­త­ల్లో ప్ర­క­టిం­చిం­ది. గతం­తో పో­లి­స్తే ఇది చాలా పె­ద్ద సం­ఖ్య అని చె­ప్ప­వ­చ్చు. ము­ఖ్యం­గా మన తె­లు­గు రా­ష్ట్రా­ల్లో రద్దీ ఎక్కు­వ­గా ఉండే రూ­ట్ల­పై రై­ల్వే ప్ర­త్యేక దృ­ష్టి సా­రిం­చిం­ది.సి­కిం­ద్రా­బా­ద్, వి­కా­రా­బా­ద్ మరి­యు లిం­గం­ప­ల్లి నుం­డి.. కా­కి­నాడ టౌన్, నర్సా­పూ­ర్, తి­రు­ప­తి, శ్రీ­కా­కు­ళం, అన­కా­ప­ల్లి మరి­యు వి­శా­ఖ­ప­ట్నం మా­ర్గా­ల్లో అత్య­ధిక సం­ఖ్య­లో రై­ళ్లు నడు­స్తు­న్నా­యి. ఈ ప్ర­త్యేక రై­ళ్లు జన­వ­రి 8 నుం­డి 20 మధ్య అం­దు­బా­టు­లో ఉం­టా­యి. చా­లా­మం­ది ప్ర­త్యేక రై­ళ్లం­టే కే­వ­లం ఏసీ కో­చ్‌­లే ఉం­టా­య­ని అను­కుం­టా­రు. కానీ ఈసా­రి రై­ల్వే అన్ని వర్గాల వా­రి­కి ప్రా­ధా­న్య­త­ని­చ్చిం­ది. ఈ స్పె­ష­ల్ ట్రై­న్స్‌­లో 1AC, 2AC, 3AC తో పాటు సా­మా­న్యుల కోసం కో­చ్‌­లు అం­దు­బా­టు­లో ఉం­టా­యి.

Tags:    

Similar News