ప్రభుత్వం తనను ఎందుకు హౌజ్ అరెస్ట్ చేసిందో చెప్పాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తనను హౌజ్ అరెస్ట్ చేసేందుకు గల కారణాన్ని ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. తన సొంత పనిమీద ఏపీ పీసీసీ కార్యాలయానికి వెళ్తున్న ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చూస్తున్నారని మండిపడ్డారు. షర్మిల ఉద్దండరాయుని పాలెం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. విజయవాడలోని ఆమె నివాసంలో హౌజ్ అరెస్ట్ చేశారు.