అమరావతి విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ల అవినీతిని త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. పోలవరం విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, నిధుల విషయంలో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని అన్నారు.