Taraka Ratna: లోకేశ్ ను కలసిన తారకరత్న... అసలు విషయం అదే...

అపూర్వ కలయికగా మారిన లోకేశ్-తారకరత్న భేటీ; రాబోయే ఎన్నికలే ప్రధాన ఎజెండా

Update: 2023-01-10 10:16 GMT

తెలుగురాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర ఘట్టాలు చోటుచేసుకుంటున్నాయి. తారాస్థాయిలో జరుగుతున్న భేటీలు, ఎప్పుడు ఎవరు ఎవరితో చేతులు కలుపుతారు అన్న ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. తాజాగా నందమూరి వారసుడు తారకరత్న యువనేత నారా లోకేశ్ ను కలసిన తరుణం ఈ కోవలోకే చేరుతుంది. 


అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్న తారకరత్న ఈ మధ్య రాయకీయాల్లోనూ క్రియాశీలకంగా మారుతున్న సంగతి తెలిసిందే. పలు సభలు, సమావేశాల్లో మమేకమవుతోన్న ఆయన తీరు చూస్తుంటే రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న సంగతి అర్ధమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను అధికారికంగా కలసిన తారకరత్న  ఈ  విషయంలో అందరికీ క్లారిటీ ఇచ్చేశారనే చెప్పాలి. 


ఇరువురి భేటీలో ఎన్నో విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచి పోటీచేయాలి, ఎక్కడ టికెట్ కేటాయిస్తారన్న అంశాలూ చర్చించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 


Tags:    

Similar News