CBN: టీడీపీ ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్

టీడీపీ భేటీకి 15 మంది ఎమ్మేల్యేల డుమ్మా... పార్టీ పనుల కంటే మీ పనులు ఎక్కువా..... ప్రజల్లోకి వెళ్లేందుకు నామోషీ ఎందుకు..? చంద్రబాబు సూటి ప్రశ్నలు;

Update: 2025-06-30 02:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో కూ­ట­మి ప్ర­భు­త్వం వచ్చి ఏడా­ది అయిన సం­ద­ర్భం­గా ప్ర­జా­ప్ర­తి­ని­ధు­ల­ను ఇం­టిం­టి­కీ వె­ళ్లా­ల­ని చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. ప్ర­భు­త్వ యం­త్రాం­గం, ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు వె­ళ్లి ఏడా­ది­లో అమలు చే­సిన పథ­కా­లు వి­వ­రిం­చా­ల­ని సూ­చిం­చా­రు. దీ­ని­పై టీ­డీ­పీ నే­త­ల­కు ట్రై­నిం­గ్‌ ఇచ్చే కా­ర్య­క్ర­మం ని­ర్వ­హిం­చా­రు. అందు కోసం టీ­డీ­పీ ప్ర­జా­ప్ర­తి­ని­ధు­ల­తో వర్క్‌­షా­ప్ చే­ప­ట్టా­రు. ఇం­దు­లో మా­ట్లా­డిన ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. తె­లు­గు­దే­శం పా­ర్టీ వి­స్తృ­త­స్థా­యి సమా­వే­శా­ని­కి గై­ర్హా­జ­రైన 15మంది ఎమ్మె­ల్యే­లు వి­దే­శా­ల్లో ఉం­డ­టం­పై సీఎం చం­ద్ర­బా­బు తీ­వ్ర ఆగ్ర­హం వ్య­క్తం­చే­శా­రు. ని­యో­జ­క­వ­ర్గా­ల్లో ప్ర­జ­ల­కు దూ­రం­గా ఉం­డ­టం సరి­కా­ద­ని గట్టి­గా హె­చ్చ­రిం­చా­రు. ఆహ్వా­ని­తు­ల్లో 56మంది గై­ర్హా­జ­ర­య్యా­ర­ని సీఎం అస­హ­నం వ్య­క్తం చే­శా­రు. ఉదయం ఎంత మంది వచ్చా­రు, సం­త­కా­లు పె­ట్టి ఎంత మంది వె­ళ్లి­పో­యా­రు, సమా­వే­శం చి­వ­రి వరకూ ఎంత మంది ఉన్నా­రో అం­ద­రి లె­క్క­లు తన వద్ద ఉన్నా­య­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. గతం­లో ఎప్పు­డూ లేని వి­ధం­గా గత ఎన్ని­క­ల్లో పా­ర్టీ­లో మా­ర్పు­లు చే­శా­మ­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. సో­ష­ల్ ఇం­జి­నీ­రిం­గ్ చేసి అం­ద­రి­కీ సమాన అవ­కా­శా­లు ఇచ్చా­మ­ని గు­ర్తు చే­శా­రు. అం­దు­కే ఈసా­రి ఎక్కువ మంది కొ­త్త­వా­ళ్లు ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు ఎన్ని­క­య్యా­ర­ని గు­ర్తు చే­శా­రు. వారు మళ్లీ మళ్లీ గె­ల­వా­ల­ని చం­ద్ర­బా­బు ఆకాం­క్షిం­చా­రు. అలా మళ్లీ మళ్లీ గె­లి­చేం­దు­కు ఇప్పు­డు వచ్చిన మె­జా­ర్టీ కంటే ఎక్కువ తె­చ్చు­కు­నే­లా ప్ర­య­త్నిం­చా­ల­ని దిశా ని­ర్దే­శం చే­శా­రు. ప్ర­జ­ల­తో మమే­క­మై­తే­నే భవి­ష్య­త్తు ఉం­టుం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. పా­ర్టీ కా­ర్య­క్ర­మా­ల­కం­టే ఇత­ర­త్రా ఎక్కు­వ­య్యా­యా అని ని­ల­దీ­శా­రు.

నిత్యం ప్రజల్లో ఉండాలి..

ప్ర­జా ప్ర­తి­ని­ధు­లు ని­త్యం ప్ర­జ­ల్లో ఉం­డా­ల­ని చం­ద్ర­బా­బు సూ­చిం­చా­రు. ఎవరు ఎలా పని చే­స్తు­న్నా­రో గతం కంటే ఈసా­రి క్లి­య­ర్ కట్‌­గా సమా­చా­రం వస్తోం­ద­ని తె­లి­పా­రు. ఆ రి­పో­ర్టు­ల­ను ఎమ్మె­ల్యే చే­సిన తప్పు­లు మంచి పను­లు తన వద్ద ఉన్నా­య­ని వి­వ­రిం­చా­రు. వా­టి­ని ఆధా­రం­గా ఎమ్మె­ల్యే­తో మా­ట్లా­డు­తు­న్నా­న­ని వి­వ­రిం­చా­రు. శని­వా­రం నుం­చి ఈ ప్ర­క్రియ ప్రా­రం­భిం­చి­న­ట్టు చం­ద్ర­బా­బు ప్ర­క­టిం­చా­రు. నలు­గు­రి­తో మొ­ద­లు పె­ట్టా­న­ని కచ్చి­తం­గా రో­జు­కు నలు­గు­రి­తో మా­ట్లా­డ­తా­న­ని టీ­డీ­పీ అధి­నేత వె­ల్ల­డిం­చా­రు. అన్నీ పూ­ర్తి చే­శా­మ­ని చె­ప్ప­డం లే­ద­ని కానీ ప్ర­జ­ల­కు అవ­స­ర­మై­న­వి అమలు చే­శా­మ­ని తె­లి­పా­రు. ఇంకా అమలు చే­యా­ల్సిన ఉన్నా­య­ని వా­టి­ని ఎం­దు­కు అమలు చే­య­లే­క­పో­తు­న్నా­మో ప్ర­జ­ల­కు వి­వ­రిం­చా­ల­ని తె­లి­పా­రు. అం­దు­కే సు­ప­రి­పా­ల­న­లో తొలి అడు­గు అనే కా­న్సె­ప్టు తీ­సు­కొ­చ్చా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. నా­లు­గే­ళ్లు రా­జ­కీ­యా­లు మర్చి­పో­యి రా­ష్ట్రం కోసం కష్ట­ప­డి ఆఖరి ఏడా­ది ఎన్ని­కల గు­రిం­చి ఆలో­చి­స్తే మంచి ఫలి­తా­లు రా­వ­ని చం­ద్ర­బా­బు అన్నా­రు .

Tags:    

Similar News

TG: యమ"పాశం"