TELUGU MAHASABHA: అట్టహాసంగా తెలుగు మహాసభలు

పాల్గొన్న సుప్రీంకోర్టు జడ్డీ జస్టిస్ శ్రీనరసింహ.. సభల్లో జేడీ లక్ష్మీనారాయణ కీలకోపన్యాసం..తెలుగు గొప్పతనం చాటేలా సభా ప్రాంగణం

Update: 2026-01-04 04:00 GMT

ఆం­ధ్ర సా­ర­స్వత పరి­ష­త్తు ఆధ్వ­ర్యం­లో గుం­టూ­రు­లో మూడో ప్ర­పంచ తె­లు­గు మహా­స­భ­లు ఘనం­గా ప్రా­రం­భ­మ­య్యా­యి. మూడు రో­జు­ల­పా­టు జర­గ­ను­న్న ఈ వే­డు­క­ల­కు తె­లు­గు భా­షా­భి­మా­ను­లు, సా­హి­తీ­ప్రి­యు­లు అధిక సం­ఖ్య­లో తర­లి­వ­చ్చా­రు. తె­లు­గు మహా­స­భల వే­దిక వద్ద.. రా­మో­జీ­రా­వు కళా­ప్రాం­గ­ణం, ఎన్టీ­ఆ­ర్ ప్రాం­గ­ణం ప్ర­త్యేక ఆక­ర్ష­ణ­గా ని­లు­స్తోం­ది. ఇక్కడ ఏర్పా­టు చే­సిన రా­మో­జీ­రా­వు వి­గ్ర­హా­న్ని చూ­సి­న­వా­రం­తా హర్షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. తె­లు­గు భా­ష­కు ఆయన చే­సిన కృ­షి­ని కొ­ని­యా­డు­తు­న్నా­రు.

హాజరైన సుప్రీంకోర్టు సీజే

మహా­స­భల ప్రా­రం­భో­త్సవ కా­ర్య­క్ర­మం­లో సు­ప్రీం­కో­ర్టు న్యా­య­మూ­ర్తి జస్టి­స్‌ పమి­డి­ఘం­టం శ్రీ­న­ర­సింహ పా­ల్గొ­ని ప్ర­సం­గిం­చా­రు. ‘‘ఇంత పె­ద్ద తె­లు­గు సభ జరు­గు­తుం­ద­ని నేను కలలో కూడా ఊహిం­చ­లే­దు. మని­షి­కి పు­ట్టు­క­తో­నే మా­తృ­బం­ధం, భా­షా­బం­ధం ఏర్ప­డ­తా­యి. భాష కే­వ­లం భా­వ­వ్య­క్తీ­క­ర­ణ­కు మా­త్ర­మే కాదు. ఒక ప్ర­పం­చా­న్ని సృ­ష్టిం­చేంత బలం భా­ష­లో ఉంది. మనం­ద­రం భాష వల్ల బం­ధు­వు­లం. తె­లు­గు భాష వల్ల మనకు ఓ గు­ర్తిం­పు ఉంది. అధి­కార వ్య­వ­హా­రా­ల్లో తప్ప­ని­స­రి­గా తె­లు­గు ఉం­డా­లి. జి­ల్లా­స్థా­యి వరకు కో­ర్టు కా­ర్య­క­లా­పా­లు తె­లు­గు­లో జర­గా­లి. ’’ అని ఆకాం­క్షిం­చా­రు. మూడు రో­జు­ల­పా­టు జర­గ­ను­న్న ఈ మహో­త్స­వం తె­లు­గు భాష, సా­హి­త్యం, సం­స్కృ­తి, కళ­ల­కు అం­కి­త­మై సా­గ­నుం­ది. దేశ వి­దే­శాల నుం­చి తర­లి­వ­చ్చిన వే­లా­ది మంది తె­లు­గు భా­షా­భి­మా­ను­లు, రచ­యి­త­లు, కవు­లు, మే­ధా­వు­ల­తో గుం­టూ­రు నగరం పం­డుగ వా­తా­వ­ర­ణా­న్ని సం­త­రిం­చు­కుం­ది. ప్రా­రంభ వే­డు­కల నుం­చే మహా­స­భల ప్రాం­గ­ణం సం­ద­డి­గా మా­రిం­ది. సం­ప్ర­దాయ సం­గీ­తం, నృ­త్యా­లు, వే­దిక అలం­క­రణ, తె­లు­గు ను­డి­కా­రం ప్ర­తి­బిం­బిం­చే శి­ల్పా­లు అం­ద­రి­నీ ఆక­ట్టు­కు­న్నా­యి.


 మాతృభాషలోనే చదివారు: లక్ష్మీనారాయణ

‘‘ఐదో తర­గ­తి వరకు మా­తృ­భా­ష­లో­నే చద­వా­ల­ని జా­తీయ వి­ద్యా వి­ధా­నం చె­బు­తోం­ది. నాకు తె­లు­గు బాగా వచ్చు కా­బ­ట్టే ఐదు భా­షా­లు నే­ర్చు­కు­న్నా. ప్ర­పం­చం­లో వి­విధ రం­గాల ప్ర­ము­ఖు­లు వారి మా­తృ­భా­ష­లో చదు­వు­కు­న్నా­రు. ఇం­గ్లీ­ష్ వల్లే ఉద్యో­గా­లు రావు. విషయ పరి­జ్ఞా­నం ఉంటే వస్తా­యి. ప్ర­భు­త్వం, ప్ర­జా­ప్ర­తి­ని­ధు­లు ఈ వి­ష­యం­పై దృ­ష్టి పె­ట్టా­లి’’ అని పూ­ర్వ జేడీ లక్ష్మీ­నా­రా­యణ తె­లి­పా­రు.

మహా­స­భల ప్రాం­గ­ణం­లో ఏర్పా­టు చే­సిన ఎన్టీ­ఆ­ర్ ప్రాం­గ­ణం కూడా ప్ర­త్యేక కేం­ద్రం­గా ని­లు­స్తోం­ది. తె­లు­గు జాతి ఆత్మ­గౌ­ర­వా­ని­కి ప్ర­తీ­క­గా ని­లి­చిన మహా­న­టు­డు, మాజీ ము­ఖ్య­మం­త్రి ఎన్టీ­ఆ­ర్ జీ­వి­తం, సే­వ­ల­ను స్మ­రిం­చు­కు­నే­లా ఈ ప్రాం­గ­ణా­న్ని తీ­ర్చి­ది­ద్దా­రు. ఆయన నటన, రా­జ­కీయ ప్ర­యా­ణం, తె­లు­గు ప్ర­జ­ల­పై చూ­పిన ప్ర­భా­వా­న్ని వి­వ­రి­స్తూ ఏర్పా­టు చే­సిన ప్ర­ద­ర్శ­న­లు యు­వ­త­ను వి­శే­షం­గా ఆక­ర్షి­స్తు­న్నా­యి. మహా­స­భ­ల్లో పా­ల్గొ­న­డా­ని­కి గుం­టూ­రు నగ­రా­ని­కి వి­విధ రా­ష్ట్రా­లు, వి­దే­శాల నుం­చి తె­లు­గు ప్రే­మి­కు­లు తర­లి­వ­చ్చా­రు. వి­శ్వ­వి­ద్యా­ల­యాల అధ్యా­ప­కు­లు, పరి­శో­ధ­కు­లు, రచ­యి­త­లు, వి­ద్యా­ర్థు­లు పె­ద్ద సం­ఖ్య­లో పా­ల్గొం­టు­న్నా­రు. తె­లు­గు భాష భవి­ష్య­త్‌, ఆధు­నిక సాం­కే­తి­క­త­తో భాష అను­సం­ధా­నం, డి­జి­ట­ల్ యు­గం­లో తె­లు­గు పా­త్ర వంటి అం­శా­ల­పై చర్చ­లు జర­గ­ను­న్నా­యి. అలా­గే, ప్రా­చీన గ్రం­థాల పరి­ర­క్షణ, కొ­త్త రచ­న­ల­కు ప్రో­త్సా­హం వంటి అం­శా­ల­పై తీ­ర్మా­నా­లు తీ­సు­కు­నే అవ­కా­శం ఉం­ద­ని ని­ర్వా­హ­కు­లు తె­లి­పా­రు.

Tags:    

Similar News