బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం.. వైరస్ బారిన పడి ముగ్గురు ఉద్యోగులు మృతి..!
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. ముగ్గురు దేవస్థాన ఉద్యోగులు వైరస్ బారిన పడి మృతి చెందారు. NMRగా పనిచేస్తున్న ఉద్యోగి ఇవాళ మృతి చెందారు.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. ముగ్గురు దేవస్థాన ఉద్యోగులు వైరస్ బారిన పడి మృతి చెందారు. NMRగా పనిచేస్తున్న ఉద్యోగి ఇవాళ మృతి చెందారు. నిన్న ఆలయ అర్చకులు మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం కూడా ఓ అర్చకుడు మరణించారు. మరికొందరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. అటు.. దర్శన వేళల్లో మార్పులు చేశారు అధికారులు. ఉదయం 6 నుంచి పదకొండున్నర వరకే అనుమతిస్తారు.