Vijayawada : లిఫ్ట్ కేబుల్ తెగిపడి ముగ్గురు మృతి

ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ లో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది

Update: 2023-03-18 08:43 GMT

Breaking News : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో ఎలివేటర్ కేబుల్ తెలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన శనివారం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ లో ఎనిమిది మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వీటీపీఎస్ సిబ్బంది,  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News