ఏపీలో జంపింగ్ సీజన్ నడుస్తోంది. వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాను జనసేన పార్టీలో చేరడం కొందరు రాజకీయ ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారని.. సామినేని ఉదయభాను అన్నారు. ఇదే అదునుగా తనపై కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
దమ్ముంటే ఆరోపణలపై చర్చలకు రావాలని సవాల్ విసిరారు ఉదయభాను. ఇకనుంచి తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు సామినేని ఉదయభాను.