Ranbir Kapoor: రణబీర్ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం.. షూటింగ్ వాయిదా..

Ranbir Kapoor: కొన్నాళ్లు వెండితెరకు దూరంగా ఉన్న రణబీర్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

Update: 2022-08-05 12:00 GMT

Ranbir Kapoor: మామూలుగా సినిమా షూటింగ్ సెట్ అంటేనే ఎన్నో జాగ్రత్తలతో ఏర్పాట్లు చేస్తారు. ప్రాణాలకు తెగించే స్టంట్స్ చేసినా.. ఎంత కష్టమైన సీన్స్ షూట్ చేయాలన్నా కూడా తగిన జాగ్రత్తలు లేకుండా ప్రారంభించదు మూవీ టీమ్. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇటీవల రణబీర్ సినిమా సెట్స్‌లో కూడా అలాంటి ప్రమాదమే జరిగింది.

కొన్నాళ్లు వెండితెరకు దూరంగా ఉన్న రణబీర్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'షంషేరా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. త్వరలోనే 'బ్రహ్మాస్త్ర'తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ప్రస్తుతం లవ్ రాంజన్ దర్శకత్వంలో రణబీర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కొన్నిరోజుల క్రితం అంధేరి వెస్ట్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగింది.


రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రమాద సమయంలో షూటింగ్ సెట్ వద్దే ఉన్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం చాలా భారీగా జరిగి.. మేకర్స్‌కు నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే దీనివల్ల మరికొన్ని రోజులు ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న 'యానిమల్'కు కూడా రణబీర్ ఇప్పటికే డేట్స్ ఇచ్చేశాడు. దీంతో ఇప్పట్లో మళ్లీ లవ్ రాంజన్ చిత్రానికి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని బాలీవుడ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News