చమురు కంపెనీలు మళ్లీ షాకిచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ల (LPG Cylinder) ధరలను పెంచాయి. గ్యాస్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులపై మళ్లీ భారం పడింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి ఆయిల్ కంపెనీలు.
శుక్రవారం అంటే మార్చి 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. ఒక్కో సిలిండర్ పై రూ. 25.50 పెంచాయి.
ఇళ్లలో వాడే 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 2024లో రెండుసార్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవరాల్ గా 40 రూపాయలకు పైగా పెద్ద సిలిండర్ రేటు పెరిగింది.