మేచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన మూవీ ‘విశ్వం’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ప్రస్తుతం హీరో, హీరోయిన్ తో పాటు దర్శకుడికీ ఈ సినిమా విజయం అత్యంత కీలకం.. ఇంపార్టెంట్. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే మోస్ట్ ప్రామిసింగ్ అనేలానే ఉంది. శ్రీను వైట్ల మార్క్ యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూ ఢోకా లేదు అనేలా ఉంది. దూకుడు తరహాలో స్టైలిష్ గానూ కనిపిస్తోంది. లేటెస్ట్ గా శ్రీను వైట్ల బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి మదర్ సెంటిమెంట్ సాంగ్ ను విడుదల చేశారు.
‘మొండి తల్లి పిల్లా నువ్వు’అంటూ సాగే ఈ గీతాన్ని శ్రీహర్ష ఈమని రాశాడు. సాహితి చాగంటి పాడింది. సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రెగ్నెంట్ గా ఉన్న ఓ తల్లి పాడిన పాటలా ఉంది. అయితే ఆ తల్లి ఓ పెద్ద వ్యాధితో బాధపడుతూ చావు అంచుల్లో ఉంటుంది. అందుకే ఆల్రెడీ తనకు ఉన్న కూతురుతో పాటు పుట్టబోయే బిడ్డకు అండగా ఉండలేనేమో బహుశా అనే ఆవేదనతో నిండిన గీతం ఇది.
‘అమ్మగుండె బరువే చెప్పుకుంది వినవే.. ఊపిరంత పోగేసి రాశా.. తప్పటడుగులలో బిక్కుమన్న వేళలో పక్కనుండలేనమ్మ బహుశా.. నువ్వెక్కడా అంటూ చూడకు నేనచ్చం నీలానే ఉంటా.. నా పంచప్రాణాల బొమ్మ మీద దిష్టి చుక్క నేనై ఉంటా.. మొండి తల్లి పిల్లా నువ్వు..’మొదలైన పల్లవితోనే అద్భుతమై సాహిత్యంతో ఆకట్టుకున్నాడు శ్రీమణి. చావు అంచుల్లో ఉన్న ఓ తల్లి తన పిల్లల కోసం ఇంతకు మించి తపన పడదేమో అనేలా గొప్ప అక్షరాలు కూర్చాడు. అంతే ఆర్ద్రతతో సాహితి కూడా పాడింది. మొత్తంగా ఈ పాప చుట్టూనే హీరో పాత్ర కూడా ఉంటుందేమో అనేలా కనిపిస్తోంది.