హీరో బాలకృష్ణ (Bala Krishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన ‘అఖండ’ సినిమా ఏ స్థాయిలో విజయం అందుకుందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వందకోట్ల మైలురాయిని దాటిందీ చిత్రం. దీంతో ఈ మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా ఈ నవంబర్లో ‘అఖండ-2’ సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
సోషియో ఫాంటసీ, యాక్షన్, ఎమోషనల్ అంశాలతో సీక్వెల్ను తెరకెక్కించేలా బోయపాటి కసరత్తు చేస్తున్నారని టాక్. ఇందులో బాబీ డియోల్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన్ని తీసుకోబోతున్నారని తెలిసింది.
ఈ సీక్వెల్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముందని సమాచారం. అటు బాలయ్య వరుస విజయాలతో జోరుమీదున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.