Divyanka Tripathi : ప్రముఖ టెలివిజన్ నటికి యాక్సిడెంట్
దివ్యాంక ఏప్రిల్ 19, శుక్రవారం శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు ఆమె భర్త, నటుడు వివేక్ తెలిపారు.;
ప్రముఖ టెలివిజన్ నటి, ఖత్రోన్ కే ఖిలాడీ ఫేమ్ దివ్యాంక త్రిపాఠి దహియా ఏప్రిల్ 18న ప్రమాదానికి గురైనట్లు ఆమె భర్త వివేక్ దహియా, ఆమె బృందం ఇన్స్టాగ్రామ్లో ధృవీకరించింది. వివేక్ ఇన్స్టాగ్రామ్లో దివ్యాంక ఎక్స్-రే ఫోటోను పంచుకున్నారు. ఈ సంఘటనలో ఆమె చేయి విరిగిందని వెల్లడించారు. ఆమెకు ఏప్రిల్ 19, శుక్రవారం శస్త్రచికిత్స చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.
ఏప్రిల్ 18 న పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో, వివేక్ ఇలా తెలియజేశాడు, “దివ్యాంక మామ్ తన చేతిపై రెండు ఎముకలు విరిగాయి. రేపు శస్త్రచికిత్స జరగనుంది అని రాశాడు.
దివ్యాంక వైద్య విధానాలను ఎదుర్కోవడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు, ఆమె లిగమెంట్ టియర్ కోసం శస్త్రచికిత్స చేయించుకుంది.
దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియాల ప్రేమకథ ప్రముఖ షో 'యే హై మొహబ్బతే' సెట్స్లో వికసించింది మరియు వారు జూలై 8, 2016న వివాహం చేసుకున్నారు. ఇక వృత్తిరీత్యా, దివ్యాంక ఇటీవలే ఇన్స్పెక్టర్ పార్వతి సెగల్ పాత్రను పోషించి 'అదృశ్యం' ధారావాహికతో టెలివిజన్కి తిరిగి వచ్చింది. ఈ షోలో రవి వర్మగా ఎయిజాజ్ ఖాన్ కూడా నటించారు.