మలయాళ నటుడి కుమార్తె వివాహానికి ప్రధాని హాజరు..
ఈ వివాహ వేడుకకు మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ తారలంతా హాజరయ్యారు.;
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం కేరళలో జరిగిన నటుడు-రాజకీయ నాయకుడు సురేష్ గోపి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ తారలంతా హాజరయ్యారు.
ప్రధాని మోదీ.. నూతన వధూవరులకు దండలు అందించారు. వివాహ వేడుకలో వాటిని మార్చుకున్నారు. నూతన వధూవరులను ప్రధాని ఆశీర్వదించారు. మమ్ముట్టి, మోహన్లాల్, దిలీప్తో సహా ప్రముఖ మలయాళ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ముందు ఆలయంలో పెళ్లి చేసుకున్న దంపతులకు మోదీ ఆశీస్సులు అందించి, స్వీట్లు ఇచ్చారు. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా ప్రఖ్యాత శ్రీ కృష్ణక్షేత్రంలో తెల్లవారుజాము నుంచే పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.