సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ను పరామర్శించారు సినీ హీరో ప్రభాస్. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు. దీంతో కూకట్పల్లి ఇందు విల్లాస్ లోని వారి నివాసానికి వెళ్లారు ప్రభాస్. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు. ప్రభాస్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు రాజేంద్రప్రసాద్.