యూపీలో జరిగిన ఎన్ కౌంటర్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లో షార్కూటర్గాపే రుగాంచిన కరడుగట్టిన నేరస్థుడు హతమయ్యా డు. మృతున్ని ఘజియాబాద్ లోని ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ గుర్తించారు. అతడిపై ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 20కి పైగా క్రిమిన ల్ కేసులు నమోదయ్యాయి. హత్య, హత్యాయ త్నం, కిడ్నాప్ లు, దోపిడీలు సహా మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు నిర్వహిం చిన జాయింట్ ఆపరేషన్లో భాగంగా హపుర్ కొత్వాలీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో అతడు తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తర లించామని, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు వెల్లడించారు. 2008లో నేర ప్రవృత్తి మొదలు పెట్టిన నవీన్ కుమార్పై 2010లో యూపీలో గ్యాంగ్ స్టర్ చట్టం కింద కేసు నమోదైంది.