దేశంలో సంచలనం సృష్టించిన కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్క సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. BNS 64, 66, 103/1 ప్రకారం ఖైదుతో పాటు, కౌ50 వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది. 2024 ఆగస్టు09న RG Kar మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి ఉరే సరైన నిర్ణయమని డిమాండ్లు వచ్చాయి.
కోల్ కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు దోషి సంజయ్ రాయికి జీవితఖైదు విధించడంపై బాధితురాలి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అతడికి ఉరిశిక్ష విధించాలని కోర్టు హాల్లో డిమాండ్ చేశారు. అప్పుడే తమ కూతురికి న్యాయం జరిగినట్లని వారు పేర్కొన్నారు. అటు ఈ దారుణం వెనుక మరింత మంది ఉన్నారని, సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయలేదని వారు వాదిస్తూ వస్తున్నారు.