కర్నూలు జిల్లాలో భారీగా వజ్రాల నగలు, బంగారం సీజ్
కర్నూలు జిల్లాలో భారీగా వజ్రాల నగలు, బంగారం సీజ్ చేశారు పోలీసులు.
కర్నూలు జిల్లాలో భారీగా వజ్రాల నగలు, బంగారం సీజ్ చేశారు పోలీసులు. పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోటి 4 లక్షల విలువైన వజ్రాల నగలు, బంగారం సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధురైకి ప్రైవేట్ బస్సులో వీటిని తరలిస్తున్నట్లు సెబ్ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ క్రిస్ ఇంటర్నేషనల్ డైమండ్ జ్యువెలరీ సంస్థ నుంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. రాజకుమార్, యశ్వంత్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.