కర్నూలు జిల్లా అస్పరి ఏరియాలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిని ఓ ఉన్మాది హత్య చేశాడు. ప్రేమను నిరాకరించిందని ఉన్మాదిగా మారాడు. కోపంతో ఊగిపోయిన అతని ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి కిరాతకానికి పాల్పడ్డాడు. నగరూరు గ్రామానికి చెందిన సన్నీ గత కొంతకాలంగా అశ్విని అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతి తరచూ నిరాకరిస్తుండటంతో కోపంతో ఊగిపోయిన సన్నీ విద్యార్థిని అశ్విని నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. విషయం తెలిసిన వెంటనే అశ్విని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.