కొత్త క్రిమినల్ కోడ్.. మొదటి కేసు వీధి వ్యాపారిపై నమోదు

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద అడ్డంపెట్టి విక్రయాలు జరిపినందుకు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 285 కింద వీధి వ్యాపారిపై కేసు నమోదు చేయబడింది.;

Update: 2024-07-01 07:33 GMT

కొత్త క్రిమినల్ కోడ్ ఈ రోజు అమల్లోకి వచ్చినందున, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో రహదారిని ఆక్రమించిన  వీధి వ్యాపారిపై మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కొత్త క్రిమినల్ కోడ్ సెక్షన్ 285 ప్రకారం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయబడింది. అతడికి ఐదువేల రూపాయాల జరిమానా విధించబడుతుంది.

గత రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా విక్రయిస్తున్న వీధి వ్యాపారిని గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతని తాత్కాలిక దుకాణం రహదారికి అడ్డుగా ఉంది. దానిని తరలించమని పదేపదే అడిగారు. ఆయన వినక పోవడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు పోలీసు సిబ్బంది కదిలారు.

NDTV వద్ద ఉన్న ఎఫ్‌ఐఆర్ కాపీ, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద వీధి వ్యాపారి తన స్టాల్‌ను నిన్న అర్థరాత్రి నిలిపి ఉంచాడని పేర్కొంది. "వ్యక్తి వీధిలో వాటర్ బాటిల్స్, బీడీ మరియు సిగరెట్లను విక్రయిస్తున్నాడు. రోడ్డు నుండి స్టాల్ తొలగించమని సబ్-ఇన్‌స్పెక్టర్ వ్యక్తిని చాలాసార్లు కోరాడు, అతను అంగీకరించలేదు. సబ్-ఇన్‌స్పెక్టర్ చాలా మంది బాటసారులను విచారణలో పాల్గొనమని అడిగారు, కానీ వారు నిరాకరించారు, అప్పుడు సబ్-ఇన్‌స్పెక్టర్ ఇ-ప్రమాన్ అప్లికేషన్‌ను ఉపయోగించి వీడియో చిత్రీకరించారు" అని ఎఫ్‌ఐఆర్ పేర్కొంది.

Tags:    

Similar News