Bhadradri Kothagudem: పారిపోయిన ప్రేమ జంట.. సాయం చేసిన యువకుడిని చితకబాదిన సర్పంచ్.. మనస్థాపంతో ఆత్మహత్య..

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారంవారిగూడెంలో దారుణం జరిగింది.

Update: 2022-06-14 10:45 GMT

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారంవారిగూడెంలో దారుణం జరిగింది. మూడు రోజుల క్రితం ప్రేమ జంట పారిపోగా.. వారికి సాయం చేశారన్న అనుమానంతో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను సర్పంచ్‌ ముత్యం చితకబాదారు. దీంతో మనస్థాపానికి గురైన ఇంటర్‌ విద్యార్థి తుమ్మా భవానీ శంకర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు ముందు భవానీ శంకర్.. సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మరోవైపు వేముల నాగరాజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. భవాని శంకర్‌ మృతదేహంతో అశ్వారావుపేట పీఎస్‌ ఎదుట.. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

Similar News