AP : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సీజ్

Update: 2024-10-23 12:45 GMT

ఏపీలోని కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టయ్యింది. అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని ఆటో ట్రాలీలో తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుండి మొత్తం నాలుగు టన్నుల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. పట్టుబడిన వ్యక్తి పెద్దకళ్లేపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News