Road Accident: మద్యం మత్తులో యువతుల కారు డ్రైవింగ్.. ఒకరు మృతి

Road Accident: అంబాలా కంటోన్మెంట్ గ్రెయిన్ మార్కెట్ సమీపంలో జాతీయ రహదారి (NH)-44 (GT రోడ్)పై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, అతని భార్య మరియు ఇద్దరు కుమార్తెలు గాయపడ్డారు.

Update: 2022-05-23 05:48 GMT

Road Accident: అంబాలా కంటోన్మెంట్ గ్రెయిన్ మార్కెట్ సమీపంలో జాతీయ రహదారి (NH)-44 (GT రోడ్)పై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, అతని భార్య మరియు ఇద్దరు కుమార్తెలు గాయపడ్డారు. మృతుడు హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్ జిల్లా రాజ్‌పూర్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మోహిత్ శర్మగా గుర్తించారు. గాయపడిన వారిని మోహిత్ భార్య దీప్తి, అతని కుమార్తెలు ఆరోహి, అశ్విగా గుర్తించామని, వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు.

అంబాలా కంటోన్మెంట్ మార్కెట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శర్మ భార్య ఫిర్యాదు మేరకు అంబాలా పోలీసులు పానిపట్‌కు చెందిన వారియత జగ్లాన్ అనే మహిళపై కేసు నమోదు చేశారు. మహిళ మద్యం మత్తులో ఎస్‌యూవీ రేంజ్ రోవర్ నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పానిపట్‌కు చెందిన శ్రేయ అనే మరో మహిళ వరియాత జగ్లాన్‌తో పాటు వెళ్లింది. ఎస్‌యూవీలో ఉన్న ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వరియాత జగ్లాన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Tags:    

Similar News