హైదరాబాద్ ఫిలింనగర్ లోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. గత శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పొన్నాల ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. చోరీ ఘటనపై ఫిలింనగర్ పోలీసులకు పొన్నాల భార్య అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.