Warangal Kakatiya Medical College: మద్యం తాగి ర్యాగింగ్.. పీఎంను ట్యాగ్ చేస్తూ విద్యార్థి ట్వీట్..

Warangal Kakatiya Medical College: వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో మరోసారి ర్యాగింగ్‌ కలకలం రేపింది.

Update: 2021-11-15 06:20 GMT

Warangal Kakatiya Medical College: వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో మరోసారి ర్యాగింగ్‌ కలకలం రేపింది. ఓ విద్యార్థి ట్వీట్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రెషర్స్‌ డే పేరుతో సీనియర్‌ విద్యార్థులు కొందరు మద్యం మత్తులో తమను ర్యాగింగ్‌ చేస్తున్నారంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ మంత్రి కేటీఆర్‌, డీజీపీ, రాష్ట్ర వైద్య సంచాలకుడిని ట్యాగ్‌ చేస్తూ ఓ విద్యార్థి ట్వీట్‌ చేశాడు.

2017 బ్యాచ్‌కు చెందిన 50 మంది విద్యార్థులు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టారు ప్రిన్సిపల్‌. అటు.. వరంగల్‌ సీపీ ఆదేశాల మేరకు మట్టెవాడ పోలీసులు కేఎంసీని సందర్శించారు. న్యూమెన్స్‌ హాస్టల్‌లో ఏం జరుగుతోందనే దానిపై ఆరా తీశారు. ట్విట్టర్‌లో చేసిన ఫిర్యాదు ప్రాతిపదికగా విచారణ జరిపారు.

Tags:    

Similar News