సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో రాత్రి ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో, 45 మంది నాగ సాధువుల ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. మహాశివుని 8 అడుగుల మట్టి శివలింగానికి, జల, ఫల, పుష్ప, పంచామృతాలతో మహా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ మహా రుద్రాభిషేకానికి శివ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శివనామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది. ఎంతో భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకాన్ని తిలకించిన భక్తులు… ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే, భస్మాభిషేకం, హుజూర్ నగర్లో నిర్వహించడంతో భక్తులు అదృష్టంగా భావిస్తున్నారు.