అవినాష్ విచారణ పై ఢిల్లీ వర్గాలు నజర్
అవినాష్ విచారణ పై ఢిల్లీ వర్గాలు నజర్ పెట్టినట్లు సమాచారం. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఢిల్లీ చేరవేస్తున్నారు. పరిణామాలపై సీబీఐ హెడ్ క్వార్టర్ సీరియస్ గా ఉన్నట్లు సీబీఐ వర్గాలు అంటున్నాయి. ప్రాధాన్యత ఉన్న కేసుల్లో ఇలా జరిగితే విశ్వాసం కోల్పోతామని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవినాష్ విచారణను పదే పదే ఎందుకు వాయిదా వేస్తున్నారని స్థానిక అధికారులను ఢిల్లీ సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
కర్నూలులో ఆపరేషన్ అవినాష్
కర్నూలులో ఆపరేషన్ అవినాష్ కొనసాగుతోంది. పోలీస్ గెస్ట్ హౌస్కు చేరుకున్న సీబీఐ అధికారులు...జిల్లా ఎస్పీతో సీబీఐ అధికారుల చర్చలు జరుపుతున్నారు.శాంతిభద్రతల నేపథ్యంలో అవినాష్ లొంగి పోవాలని చెప్పాలని సీబీఐ అధికారులు కోరినట్లు సమాచారం.అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపధ్యంలో విశ్వభారతి ఆసుపత్రికి అవినాష్ అను చరులు భారీగా చేరుకుంటున్నారు. ఈనేపధ్యం లో విశ్వభారతి ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరించారు.